యూపీ ప్రభుత్వం లా పంజాబ్, రాజస్థాన్లో అత్యాచారాలను దాచడం లేదు : రాహుల్
ABN , First Publish Date - 2020-10-25T17:02:57+05:30 IST
పంజాబ్లో ఇటీవల జరిగిన ఓ అత్యాచార ఘటనపై బిజేపీ నాయకులు కాంగ్రస్ను తీవ్రంగా విమర్శించారు. బిజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రేస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు...
పంజాబ్లో ఇటీవల జరిగిన ఓ అత్యాచార ఘటనపై బిజేపీ నాయకులు కాంగ్రస్ను తీవ్రంగా విమర్శించారు. హత్రస్ అత్యాచార ఘటనపై కాంగ్రెస్ హంగామా చేసింది ఇప్పుడు పంజాబ్ ఘటనపై ఎందుకు నోరుమెదపడం లేదు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా కొందరు బిజేపీ బడా నాయకులు ఎద్దేవా చేశారు.
బిజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రేస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్లో బిజేపీ ప్రభుత్వం లాగా పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో జరిగే అత్యాచార ఘటనలను కప్పిపుచ్చడం లేదని, బాధితరాలి కుటుంబాన్ని బెదిరించి, వారికి న్యాయం అందకుండా అడ్డుపడడం లేదని రాహుల్ బిజేపీ విమర్శలను తిప్పికొట్టారు.