అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల..

ABN , First Publish Date - 2020-10-01T01:47:15+05:30 IST

అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులను తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి...

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల..

అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్, మల్టీప్లెక్స్‌లకు అనుమతి

న్యూఢిల్లీ: అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులను తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతినిచ్చింది. అయితే.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరవడంపై, విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదించాక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2020-10-01T01:47:15+05:30 IST