పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

ABN , First Publish Date - 2021-10-18T06:11:43+05:30 IST

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక మధుర జ్ఞాపకాలతో ఆనందపరవశం నిండింది.

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
గుత్తిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో పూర్వ విద్యార్థుల గ్రూప్‌ ఫొటో

గుత్తి/పామిడి/యల్లనూరు, అక్టోబరు 17: పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక మధుర జ్ఞాపకాలతో ఆనందపరవశం నిండింది. ఆ దివారం గుత్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1995-96 విద్యాసంవత్సరం లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు స్థానిక రైల్వే క మ్యూనిటీ హాల్‌లో ఒక్కచోట చేరారు. పామిడి టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997-98 విద్యా సంవత్సరం పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆ పాఠశాలలో సందడి చేశారు. యల్లనూరు జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో 1987 సంవత్సరంలో విద్యను అభ్యసించిన వి ద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా సాగింది. 


ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ బాగోగులు తెలుసుకున్నారు. చదువుకున్న రోజుల్లో జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉబ్బి తబ్బిబయ్యారు. అప్పటి గురువులను ఘనంగా సన్మానించారు. అంద రూ కలిసి విందు భోజనాలు ఆరగించారు. గ్రూప్‌ ఫొటోలు దిగి కొంగొత్త జ్ఞాపకాలు పథిలం చేసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో అ ప్పటి ఉపాధ్యాయులు, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.




Updated Date - 2021-10-18T06:11:43+05:30 IST