ఉగ్రవాదం కూడా కరోనా లాంటిదే: విదేశాంగ శాఖ మంత్రి
ABN , First Publish Date - 2021-08-20T05:09:53+05:30 IST
ఉగ్రవాదం కూడా కరోనా లాంటిదేనని భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్: ఉగ్రవాదం కూడా కరోనా లాంటిదేనని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా వ్యాఖ్యానించారు. మనలో ఒక్కరు అపాయంలో ఉన్నా మనమందరం ప్రమాదంలో ఉన్నట్టేనని తేల్చి చెప్పారు. గురువారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లష్కరే తయ్యబా, జైషే మహ్మద్ లాంటి సంస్థలు తమకు శిక్షపడుతుందన్న భయమే లేకుండా తమ కార్యకలాపాలను ఇనుమడించిన ఉత్సాహంతో కొనసాగిస్తున్నాయి అని ఆయన ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఉగ్రవాదం అణచివేత విషయంలో భద్రతామండలి ఏమరపాటుగా ఉండకూడదని కూడా సూచించారు.