యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... 18 మంది దుర్మరణం!

ABN , First Publish Date - 2021-07-28T12:49:27+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఘోర రోడ్డు ప్రమాదం...

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... 18 మంది దుర్మరణం!

బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వాల్వో బస్సును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బారాబంకీ పరిధిలోని రామ్‌సనేహీఘాట్ వద్ద చోటుచేసుకుంది.


ప్రమాదానికి గురయిన బస్సు హరియాణాలోని పల్వల్ నుంచి బీహార్ వెళుతోంది. బస్సులో కూలీలు ఉన్నారు. వారంతా బీహార్ వెళుతున్నారు. వందమంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో 18 మంది మృతి చెందారు. బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్ మాట్లాడుతూ ఈ బస్సు మరమ్మతుకు గురవడంతో, దానిని రామ్ సనేహీఘాట్ వద్ద నిలిపివుంటారు. ఇంతలో ఒక ట్రక్కు ఈ బస్సును బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందని తెలిపారు.

Updated Date - 2021-07-28T12:49:27+05:30 IST