తనకు గోరఖ్‌పూర్ సీటు కేటాయించడంపై యోగి స్పందన

ABN , First Publish Date - 2022-01-15T21:29:55+05:30 IST

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.

తనకు గోరఖ్‌పూర్ సీటు కేటాయించడంపై యోగి స్పందన

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సబ్ కా సాథ్ సబ్‌ కా వికాస్ అనే మంత్రం ఆధారంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. పూర్తి మెజార్టీతో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని యోగి విశ్వాసం వ్యక్తం చేశారు. గోరఖ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి యోగి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. 


403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చ్ 10న ఫలితాలు వెలువడనున్నాయి.    

Updated Date - 2022-01-15T21:29:55+05:30 IST