UP Congress: టికెట్ల దరఖాస్తుల పర్వం ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-15T17:50:12+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోరుకునే వారు దరఖాస్తుతోపాటు 11వేల రూపాయల నగదును చెల్లించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ కోరారు....

UP Congress: టికెట్ల దరఖాస్తుల పర్వం ప్రారంభం

 పార్టీ టిక్కెట్ల కోసం దరఖాస్తుతోపాటు రూ.11వేలు చెల్లించండి

యూపీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ డిమాండ్ 

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోరుకునే వారు దరఖాస్తుతోపాటు 11వేల రూపాయల నగదును చెల్లించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తులతోపాటు 11వేల రూపాయల విరాళంతో ఈ నెల 25వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అజయ్ కుమార్ సూచించారు.ఈ మేర యూపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేతలకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. దరఖాస్తులను జిల్లా, నగర పార్టీ అధ్యక్షులకు సమర్పించాలని ఆయన సూచించారు.


యూపీలో ఉన్న 403 అసెంబ్లీ స్థానాలుండగా, సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలున్న 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఓ జాబితాను రూపొందించి రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికలకమిటీకి పంపిస్తాయని ఆయన చెప్పారు. జాబితాలోని పేర్లను పరిశీలించి వాటిలో కొన్నింటిని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తామని యూపీసీసీ అధినేత చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులను వారి రాజకీయ కార్యకలాపాల వివరాలతో సమర్పించాలని అజయ్ కుమార్ కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో 12వేల కిలోమీటర్ల దూరం యాత్రను వచ్చే నెలలో ప్రారంభిస్తామని యూపీసీసీ అధ్యక్షుడు చెప్పారు. 

Updated Date - 2021-09-15T17:50:12+05:30 IST