అమ్మాయిలు కత్తులు దగ్గరుంచుకోవాలి: మంత్రి మనోహర్ లాల్

ABN , First Publish Date - 2020-10-21T12:55:16+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో మహిళల రక్షణకు మిషన్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అమ్మాయిలు తమ రక్షణకు తమ దగ్గర కత్తులను...

అమ్మాయిలు కత్తులు దగ్గరుంచుకోవాలి: మంత్రి మనోహర్ లాల్

లలిత్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో మహిళల రక్షణకు మిషన్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అమ్మాయిలు తమ రక్షణకు తమ దగ్గర కత్తులను ఉంచుకోవాలని, అవసరమైనపుడు వాటిని వాడాలని యూపీ ప్రభుత్వ మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా అధికారుల సమక్షంలో మంత్రి మనోహర్‌లాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని మహిళల రక్షణకు అనేక చర్యలు చేపట్టారు. ఇటువంటి సమయంలో మంత్రి మనోహార్ లాల్ మహిళలంతా కత్తులు పట్టాలనే సలహా ఇచ్చారు. ఇంతేకాకుండా మహిళలు అవసరమైన సందర్భాల్లో కత్తులతో దాడులకు దిగాలన్నారు. లలిత్‌పూర్ పోలీస్‌లైన్‌లో జిల్లా అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. మహిళలు ఆందోళన చెందవద్దని, రాష్ట్రమంతా వారికి అండగా ఉంటుందని మంత్రి అన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 


Updated Date - 2020-10-21T12:55:16+05:30 IST