యూపీ రాష్ట్రమంత్రి నందగోపాల్ గుప్తాకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-09-25T13:20:32+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మరో మంత్రి నందగోపాల్ గుప్తాకు కరోనా వైరస్ సోకింది....

యూపీ రాష్ట్రమంత్రి నందగోపాల్ గుప్తాకు కరోనా పాజిటివ్

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మరో మంత్రి నందగోపాల్ గుప్తాకు కరోనా వైరస్ సోకింది. తనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో తాను వైద్యుల సలహాపై హోం ఐసోలేషన్ లోకి వెళుతున్నానని యూపీ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నందగోపాల్ గుప్తా ట్వీట్ చేశారు. ‘‘2010లో ఆర్డీఎక్స్ దాడి వల్ల నాకు పలు శస్త్రచికిత్స జరిగాయి. అనంతరం కరోనా సోకినందువల్ల నేను డాక్టర్ల సలహాపై హోంఐసోలేషన్ లోకి వెళ్లాను. మీ ప్రేమ, అభిమానాలు నాపై ఉంటే నేను కరోనాను జయిస్తాను’’ అని మంత్రి  గుప్తా ట్వీట్ లో పేర్కొన్నారు. 


యూపీలో 16 మంది రాష్ట్రమంత్రులకు కరోనా సోకగా, వారిలో సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్ రాణివరుణ్, హోంగార్డుల శాఖ మంత్రి చేతన్ చౌహాన్ లు మరణించారు.యూపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,84,277 కు చేరింది. ఇందులో 5,366 మంది మరణించారు. 

Updated Date - 2020-09-25T13:20:32+05:30 IST