యూపీలో కరోనా విలయతాండవం.. పెరిగిన కోవిడ్ మరణాలు

ABN , First Publish Date - 2020-08-06T23:22:17+05:30 IST

యూపీలో కరోనా విలయతాండవం.. పెరిగిన కోవిడ్ మరణాలు

యూపీలో కరోనా విలయతాండవం.. పెరిగిన కోవిడ్ మరణాలు

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ యూపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రం నాటికి అందిన మేరకు యూపీలో కొత్తగా 4,586 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,08,974 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వల్ల గురువారం రోజు 61 మంది మృతి చెందగా, మొత్తం 1,918 మంది కోవిడ్ వల్ల చనిపోయారని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం 43,654 మందికి కరోనా చికిత్స అందిస్తున్నామని, కరోనా నుంచి కోలుకొని 63,402 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2020-08-06T23:22:17+05:30 IST