Azamgarh: సిలిండర్ పేలి ముగ్గురు బాలికల మృతి

ABN , First Publish Date - 2021-08-09T16:22:49+05:30 IST

ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ముగ్గురు బాలికలు మరణించిన ఘటన...

Azamgarh: సిలిండర్ పేలి ముగ్గురు బాలికల మృతి

ఆజంఘడ్ (ఉత్తరప్రదేశ్): ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ముగ్గురు బాలికలు మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘడ్ పట్టణంలో జరిగింది. ఆజంఘడ్ పట్టణంలోని అహారౌలా ప్రాంతంలోని ఇమామ్ ఘడ్ గ్రామంలో ఓ మహిళ వంట చేస్తూ, ముగ్గురు బాలికలను వంటగదిలో ఉంచి మంచినీళ్లు తీసుకురావడం కోసం బయటకు వెళ్లింది. అంతలో వంటగదిలోని సిలిండర్ పేలి మంటలు అంటుకొని  ముగ్గురు మైనర్ బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. బాలికల హాహాకారాలతో స్థానికులు వచ్చి మంటలను ఆర్పి చూడగా దీపాంజలి (11), శివానీ (6)లు మరణించారు.తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల శ్రేజాల్ అనే బాలికను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ముగ్గురు సోదరిమణులైన చిన్నారులు సిలిండర్ పేలిన ఘటనలో మరణించడంతో విషాదం అలముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2021-08-09T16:22:49+05:30 IST