madrassa:నాలుగేళ్లుగా యువతిపై అత్యాచారం చేసి...అబార్షన్ చేయించిన టీచర్

ABN , First Publish Date - 2021-10-11T14:34:29+05:30 IST

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మదర్సా టీచర్ యువతిపై నాలుగేళ్లుగా అత్యాచారం చేసి, గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించిన...

madrassa:నాలుగేళ్లుగా యువతిపై అత్యాచారం చేసి...అబార్షన్ చేయించిన టీచర్

పెళ్లి పేరిట మోసం

లక్నో (ఉత్తరప్రదేశ్): పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మదర్సా టీచర్ యువతిపై నాలుగేళ్లుగా అత్యాచారం చేసి, గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించిన దారుణ ఘటన బరేలీలోని ఫీష్‌గడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. బాధిత యువతి చదువుకునేందుకు మదర్సాకు వచ్చింది. మదర్సాలో ఉపాధ్యాయుడు యువతిని తాను ప్రేమిస్తున్నానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా ఆమెపై అత్యాచారం చేశాడు. యువతి గర్భం దాల్చడంతో బలవంతంగా ఆమెకు గర్భస్రావం చేయించాడు. పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి అడిగితే చంపేస్తానని మదర్సా టీచర్ బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన కీచక ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి సజ్వాన్ చెప్పారు. 


Updated Date - 2021-10-11T14:34:29+05:30 IST