ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలి

ABN , First Publish Date - 2021-08-03T05:32:46+05:30 IST

పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సర్కారు తీరుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బంగ్లారోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఎంపీడీవో కార్యాలయం వరకూ సాగింది.

ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలి
అద్దంకిలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ నేతల డిమాండ్‌

అద్దంకిలో ర్యాలీ 

అద్దంకి, ఆగస్టు 2 :  పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.  సర్కారు తీరుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బంగ్లారోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఎంపీడీవో కార్యాలయం వరకూ సాగింది. అనంతరం టీడీపీ నాయకులు ఎంపీడీవో రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సందిరెడ్డి శ్రీనివాసరావు, కుక్కపల్లి ఏడుకొండలు, మానం మురళీమోహన్‌దాస్‌, గుంజి సుబ్బారావు, రావూరి  రమేష్‌, మలాది నటరాజ్‌, భైరపునేని రామలింగయ్య, నాగబోతు శ్రీనివాసరావు, రామిశెట్టి రవి, నారయ్య, మస్తాన్‌వలి, చెరుకూరి ఆంజనేయులు, అంజయ్య, వంపుగుడి వెంకటేశ్వర్లు, పరిటాల పవన్‌కుమార్‌, భైరపునేని సత్యనారాయణ, నాగరాజు, గుంజి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:32:46+05:30 IST