ఉపాధి పనుల తనిఖీ

ABN , First Publish Date - 2022-01-21T03:30:51+05:30 IST

మండలంలోని కలువకొండ, ఉడతావారిపాళెం, తమ్మినపట్నం గ్రామాల్లోని ఉపాధి పనులను గురువారం కేంద్రబృందం సభ్యులు సంతోష్‌, రీనా తనిఖీ చేశారు.

ఉపాధి పనుల తనిఖీ
ఉపాధి సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకుంటున్న కేంద్రబృందం సభ్యులు సంతోష్‌, రీనా

చిల్లకూరు, జనవరి 20: మండలంలోని కలువకొండ, ఉడతావారిపాళెం, తమ్మినపట్నం గ్రామాల్లోని ఉపాధి పనులను గురువారం కేంద్రబృందం సభ్యులు సంతోష్‌, రీనా తనిఖీ చేశారు. 2020-21లో చేసిన పనుల నాణ్యతను పరిశీలించి, వాటి ప్రయోజనంపై ఆరా తీశారు. అనంతరం జాబ్‌కార్డులు పరిశీలించారు. పనుల కల్పన, కూలి చెల్లింపు, గిట్టుబాటు తదితర అంశాలపై కూలీలతో మాట్లాడారు.  పీడీ తిరుపతయ్య, ఏపీడీ గోపి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీవో వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-21T03:30:51+05:30 IST