అప్పటి వరకూ చెరువులా పొలం.. సడెన్‌గా పెల్లుబికిన నేల.. అసలేమైందంటే..

ABN , First Publish Date - 2021-07-23T21:20:38+05:30 IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక పంట పొలం పెల్లుబికింది. సుమారు ఐదడుగుల ఎత్తుకు ఉబ్బింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అప్పటి వరకూ చెరువులా పొలం.. సడెన్‌గా పెల్లుబికిన నేల.. అసలేమైందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక పంట పొలం పెల్లుబికింది. సుమారు ఐదడుగుల ఎత్తుకు ఉబ్బింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఒక రైతు తన పొలంలో మట్టి తవ్వించాడట. ఆ తర్వాత సుమారు 15 అడుగుల మేర రైస్ మిల్లు నుంచి తీసుకొచ్చిన బూడిద పోశారట. దానిపై మరో 3 అడుగులు మట్టిపోయించారు. దీనిలో పంట వేశాడు.


ఈ క్రమంలో మూడు నాలుగు రోజుల నుంచి హరియాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో పొలం మొత్తం చెరువులా తయారైంది. అదే సమయంలో నెమ్మదిగా పొలంలోని నేల ఉబ్బటం ప్రారంభించింది. అలా పెరిగి పెరిగి సుమారు అడుగుల ఎత్తుకు ఎదిగిందా పొలం నేల. ఈ ఘటన జరిగినప్పుడు పొలం వద్ద ఉన్న కొందరు రైతులు ఆశ్చర్యపోయాగా.. కొందరు దీన్ని వీడియో తీశారు. జూలై 15న ఈ వింత ఘటన జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. భూమిలోని బూడిదలోని కొన్ని మినరల్స్ వల్లే ఇలా జరిగిందని చెప్తున్నారు. నీటితో కలవడంతో ఈ మినరల్స్ ఇలా స్పందించాయని, ఆ మట్టి మళ్లీ సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత పంటలు వేసుకోవచ్చని తెలిపారు. ఈ ఘటన వల్ల పొలంలోని నేలకు ఎటువంటి సమస్యా రాదని స్పష్టంచేశారు.



Updated Date - 2021-07-23T21:20:38+05:30 IST