ముగిసిన ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ-వేలం
ABN , First Publish Date - 2021-12-04T02:38:36+05:30 IST
ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ-వేలం ముగిసింది. రెండో రోజూ ఉప్పల్ భూముల వేలం భారీగా సాగింది. మొత్తం 39 ప్లాట్ల వేలంతో
హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ-వేలం ముగిసింది. రెండో రోజూ ఉప్పల్ భూముల వేలం భారీగా సాగింది. మొత్తం 39 ప్లాట్ల వేలంతో రూ.474 కోట్ల ఆదాయం వచ్చింది. తొలి రోజు వేలంలో రూ.141 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో రోజు 16 ప్లాట్లకు రూ.333కోట్ల ఆదాయం వచ్చింది. తొలిరోజు అత్యధికంగా గజం రూ.1,01,000, రెండోరోజు అత్యధికంగా గజానికి రూ.72వేలు ధర పలికింది. అయితే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ధర తగ్గింది.
ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండీఏ అధికారులు చదరపు గజానికి అప్సెట్ ధర రూ.35వేలుగా నిర్ణయిస్తే... మూడింతల స్థాయిలో ఆదాయం వచ్చింది. ఐటీ కారిడార్గా పేరున్న మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని భూములకు ఏ మాత్రం తగ్గకుండా ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ధరలు పలకడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఉప్పల్ భగాయత్లోని ఫేజ్-1, ఫేజ్-2 లేఅవుట్లలో 23 ప్లాట్లను గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా హెచ్ఎండీఏ ఈ-వేలం నిర్వహించింది.