యాసంగి పంట కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-02-25T05:07:54+05:30 IST
యాసంగి పంట కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి
వరంగల్ అర్బన్ కలెక్టరేట్, ఫిబ్రవరి 24: యాసంగిలో రెతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అఽధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పౌరసరఫరాల, డీఆర్డీవో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఐకేపీ ద్వారా 35, పీఏసీఈ ద్వారా 69, ఏఎంసీ ద్వారా 1 ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులు గుర్తించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అఽధికారులకు కలెక్టర్ సూచించారు.