చర్చనీయాంశమైన మెలానియా ట్రంప్ పోస్ట్.. ఇంతకీ విషయం ఏంటంటే!

ABN , First Publish Date - 2020-07-13T19:53:31+05:30 IST

కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తోంది. దీంతో అగ్రరాజ్య అధినేత సైతం మాస్క్ ధరించారు. డొనాల్డ్ ట్రంప్.. మాస్క్ ధరించిన ఫొటోలు వార్తా చానళ్లలో

చర్చనీయాంశమైన మెలానియా ట్రంప్ పోస్ట్.. ఇంతకీ విషయం ఏంటంటే!

వాషింగ్టన్: కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తోంది. దీంతో అగ్రరాజ్య అధినేత సైతం మాస్క్ ధరించారు. డొనాల్డ్ ట్రంప్.. మాస్క్ ధరించిన ఫొటోలు వార్తా చానళ్లలో ప్రసారం అయిన కొద్ది గంటలకే.. ఆయన సతీమణి మెలానియా ట్రంప్.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ ఎందుకు అయిందంటే.. అందులో ఆమె మాస్క్ ధరించారు కాబట్టి. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. గత వారం మేరీ ఎలిజబెత్ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మెలానియా ట్రంప్.. మాస్క్ ధరించి, అక్కడ ఉన్న పిల్లలు, మహిళలతో సంభాషించారు. దానికి సంబంధించిన వీడియోను ఆదివారం రోజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ మాస్క్ ధరించిన ఫొటోలు.. మీడియాలో ప్రసారం అయిన తర్వాత మెలానియా ట్రంప్ మాస్క్ ధరించిన వీడియో పోస్ట్ చేయడంతో చర్చ మొదలైంది. కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. శనివారం రోజు మిలిటరీ ఆసుపత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారిగా మాస్క్ ధరించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో గత కొద్ది రోజులుగా 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 


Updated Date - 2020-07-13T19:53:31+05:30 IST