భారత టెక్ కంపెనీల వాటా కొనుగోళ్ళలో అమెరికా ముందంజ...

ABN , First Publish Date - 2020-11-30T21:40:15+05:30 IST

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ... ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్(ఎఫ్‌‌పీఐ)ల కు సంబంధించి మారిషస్‌ను అమెరికా వెనక్కు నెట్టి రెండోస్థానంలోకి వచ్చింది. ఏప్రిల్-సెప్టెంబరు 2020 లో అమెరికా నుండి భారత్‌లోకి 7.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

భారత టెక్ కంపెనీల వాటా కొనుగోళ్ళలో అమెరికా ముందంజ...

 ముంబై : వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ...  ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్(ఎఫ్‌‌పీఐ)ల కు సంబంధించి మారిషస్‌ను అమెరికా వెనక్కు నెట్టి రెండోస్థానంలోకి వచ్చింది. ఏప్రిల్-సెప్టెంబరు 2020 లో అమెరికా నుండి భారత్‌లోకి 7.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కాగా... మారిషస్ నుండి 2 బిలియన్ డాలర్లు మాత్రమే రావడం గమనార్హం. డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) డేటా ప్రకారం అంతకుముందు రెండో స్థానంలో ఉన్న మారిషస్... తాజాగా  నాలుగో స్థానానికి పడిపోయింది.  గతేడాది అమెరికా నాలుగో స్థానంలో ఉంది.


ఇక... 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.30 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. కేమాన్ ఐ‌లాండ్స్ నుండి 2.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత నెదర్లాండ్స్(1.5 బిలియన్ డాలర్లు), యూకే (1.35 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (1.13 బిలియన్ డాలర్లు), జపాన్ (653 మిలియన్ డాలర్లు), జర్మనీ (2020 మిలియన్ డాలర్లు), సైప్రస్ (48 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.


కాగా... 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు అమెరికానే టాప్ ట్రేడింగ్ భాగస్వామిగా నిలిచింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక పరమైన సంబంధాలు మెరుగుపడుతున్నాయనేందుకు ఇవి నిదర్శనాలు.


అందుకే పెరిగాయి... అమెరికా టెక్ కంపెనీలు భారతీయ కంపెనీల్లో పెద్ద ఎత్తున వాటాలను కొనుగోలు చేస్తున్నాయని, అందుకే ఎఫ్‌డీఐలు అగ్రరాజ్యం నుండి వేగంగా పెరిగాయని జేఎన్‌యూ ఎకనమిస్ట్ ప్రొఫెసర్ బిస్వజిత్ ధర్ పేర్కొన్నారు. మారిషస్ నుండి ఎఫ్డీఐలు తగ్గుతున్నప్పటికీ 2000 ఏప్రిల్ నుండి 2020 సెప్టెంబరు వరకు మారిషస్ వాటా 29 శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కాలంలో భారత్ 500.12 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో దేశంలోకి ఎఫ్‌డీఐలు 15 శాతం పెరిగి 30 బిలియన్ డాలర్లుగా ఉంది.

Updated Date - 2020-11-30T21:40:15+05:30 IST