విద్యార్థులకు అమెరికా తీపి కబురు

ABN , First Publish Date - 2021-06-11T22:50:55+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువుల కోసం సిద్ధం అవుతున్న విద్యార్థులకు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం తీపి కబురు చెప్పింది. జూన్ 14 (సోమవారం) నుంచి స్టూడెంట్ వీసాల జారీకి సంబంధించిన

విద్యార్థులకు అమెరికా తీపి కబురు

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువుల కోసం సిద్ధం అవుతున్న విద్యార్థులకు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం తీపి కబురు చెప్పింది. జూన్ 14 (సోమవారం) నుంచి స్టూడెంట్ వీసాల జారీకి సంబంధించిన ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. జూలై-ఆగస్టులో ప్రారంభమయ్యే తరగతులకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు https://ustraveldocs.com/in వెబ్‌సైట్‌ను సందర్శించి,  అపాయింట్మెంట్‌ను బుక్ చేసుకోవాలని వెల్లడించింది. విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈ సందర్భంగా ఎంబసీ తెలిపింది. 


కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించింది. అత్యవసర ప్రయాణాలకు సైతం పరిమిత సంఖ్యలో అనుమతిచ్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీసాలకు సంబంధించిన ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో వెబ్‌సైట్‌కు భారీగా రద్దీ పెరగొచ్చని యూఎస్ ఎంబసీ అభిప్రాయపడింది. సాంకేతిక సమస్యలు తలెత్తొచ్చని పేర్కొంది. అయితే అభ్యర్ధులు మాత్రం ఓపికతో ఉండాలని తెలిపింది. సాంకేతిక సమస్యలు పునరావృతం అయితే supportindia@ustraveldocs.com లేదా +91 120 4844644, +912262011000 ద్వారా ఇబ్బందులను తమ దృష్టికి తేవాలని సూచించింది. 


Updated Date - 2021-06-11T22:50:55+05:30 IST