గైనకాలజిస్ట్ నిర్వాకం.. బాధిత మహిళలకు రూ.7200 కోట్లు చెల్లిస్తానన్న యూనివర్శిటీ

ABN , First Publish Date - 2021-03-26T18:51:29+05:30 IST

మాజీ గైనకాలజిస్ట్‌పై వందలాది మహిళల లైంగిక ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(యూఎస్‌సీ) బాధితులకు 852 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 7,200కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది.

గైనకాలజిస్ట్ నిర్వాకం.. బాధిత మహిళలకు రూ.7200 కోట్లు చెల్లిస్తానన్న యూనివర్శిటీ

లాస్ ఏంజిల్స్: మాజీ గైనకాలజిస్ట్‌పై వందలాది మహిళల లైంగిక ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(యూఎస్‌సీ) బాధితులకు 852 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 7,200కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది. జార్జ్ టిండాల్ అనే వైద్యుడిపై సుమారు 700 మంది మహిళలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. 1990లో టిండాల్ ఈ నిర్వకానికి పాల్పడ్డాడు. ఇక మహిళల ఆరోపణలలో అసభ్యంగా తాకడం నుంచి అత్యాచారం వరకు ఉన్నాయి. చికిత్స కోసం యూనివర్శిటీ క్యాంపస్‌లో చేరిన మహిళల ప్రైవేట్ భాగాలను సైతం అతను ఫొటోలు తీసినట్లు సమాచారం. తాజాగా ఆయనను విచారించిన స్థానిక న్యాయస్థానం బాధిత మహిళలకు రూ.7200 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని గురువారం బాధిత తరఫు న్యాయవాదులు వెల్లడించారు.   



Updated Date - 2021-03-26T18:51:29+05:30 IST