Americaలో రెస్టారెంట్కు వెళ్లిన మహిళ.. అందరూ చూస్తుండగానే ఇలా నీచంగా..
ABN , First Publish Date - 2021-11-13T02:08:55+05:30 IST
అమెరికాలో ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. సూప్ తాగేందుకు రెస్టారెంట్కు వెళ్లిన ఆమె.. అక్కడ చేసిన పనేంటో తెలుసుకుని షాకవుతున్నారు. అంతేకాకుండా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఆమె ఏం
ఎన్నారై డెస్క్: అమెరికాలో ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. సూప్ తాగేందుకు రెస్టారెంట్కు వెళ్లిన ఆమె.. అక్కడ చేసిన పనేంటో తెలుసుకుని షాకవుతున్నారు. అంతేకాకుండా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఆమె ఏం చేసింది. నెటిజన్ల ఆగ్రహానికి ఎందుకు గురైంది. అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..
టెక్సాస్కు చెందిన ఓ మహిళ నవంబర్ 7న స్థానికంగా ఉన్న రెస్టారెంట్కు వెళ్లింది. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన రెస్టారెంట్ సిబ్బందికి.. ‘తనకు వేడి వేడిగా సూప్ కావాలి. తీసుకురా’ అని సూచించింది. దీంతో కొద్ది సమయం తర్వాత ఆర్డర్ ఇచ్చిన సూప్ను రెస్టారెంట్ సిబ్బంది ఆమెకు అందించారు. అయితే సూప్ను చూసిన వెంటనే.. సదరు మహిళ ఆగ్రహానికి లోనయింది. ‘వేడి వేడిగా సూప్ తీసుకురమ్మంటే మాత్రం.. మరీ ఇంత వేడిగా ఉన్న సూప్ తీసుకొస్తావా. దీన్ని తాగేదెలా’ అంటూ కేకలు వేసింది. అంతటితో ఊరుకోకుండా.. ఓ నీచమైన పని చేసింది. వేడి వేడి సూప్ను ఆ రెస్టారెంట్లో పని చేసే మహిళ ముఖంపైకి విసిరింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధిత మహిళను జాన్నెల్ బ్రోలాండ్గా గుర్తించారు. అయితే దాడికి పాల్పడిన మహిళ ఎవరు అనే విషయాన్ని పోలీసులు ఇంకా కనుక్కోలేదు. కానీ ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు స్పందిస్తున్నారు. దాడికి పాల్పడిన మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.