కటకటాలపాలైన టెక్సాస్ మహిళ.. కారణం తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2020-10-05T01:43:52+05:30 IST

దొంగిలించిన వస్తువులను ఆన్‌లైన్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ఓ 63ఏళ్ల మహిళకు కోర్టు జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చో

కటకటాలపాలైన టెక్సాస్ మహిళ.. కారణం తెలిస్తే షాకవుతారు!

వాషింగ్టన్: దొంగిలించిన వస్తువులను ఆన్‌లైన్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ఓ 63ఏళ్ల మహిళకు కోర్టు జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్సాస్‌కు చెందిన 63ఏళ్ల కిమ్ రిచర్డ్‌సన్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ.. రిటైల్ స్టోర్‌లకు కన్నాలు వేసింది. స్టోర్‌లలో దొంగిలించిన వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టి.. సొమ్ము చేసుకుంటుంది. గత 19 సంవత్సరాల్లో కిమ్ రిచర్డ్‌సన్.. రూ. కోట్లు విలువ చేసే వస్తువులను దొంగిలించింది. ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు.. కిమ్ రిచర్డ్‌సన్‌కు నాలుగున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించి. అంతేకాకుండా 3.8 మిలియన్ డాలర్ల(రూ.28కోట్ల) జరిమానా విధించింది. 


Updated Date - 2020-10-05T01:43:52+05:30 IST