పాక్‌తో వాణిజ్యంపై సిద్ధూకు మనీష్ తివారీ కౌంటర్

ABN , First Publish Date - 2021-12-06T00:55:56+05:30 IST

పొరుగు దేశమైన పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలంటూ పంజాబ్ కాంగ్రెస్..

పాక్‌తో వాణిజ్యంపై సిద్ధూకు మనీష్ తివారీ కౌంటర్

న్యూఢిల్లీ: పొరుగు దేశమైన పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలంటూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయంతో సొంత పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు మనీష్ తివారీ విభేదించారు. ఆదివారంనాడు మీడియా అడిగిన ప్రశ్నకు మనీష్ తివారీ స్పందిస్తూ, భారత్‌కు తీవ్రవాదులను పంపడం పాక్ మాననంత వరకూ, మాదక ద్రవ్యాలు, ఆయుధాలను డ్రోన్ల ద్వారా మన భూభాగాల్లో విడవడం వంటి పనులను ఆపనంత వరకూ ఆ దేశంతో వాణిజ్య సంబంధమైన చర్చలు జరపడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని అన్నారు. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాలని, ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు నిలిపివేయడంతో పంజాబ్ ఆదాయం గణనీయంగా దెబ్బతిందని సిద్ధూ ఇటీవల కాలంలో పదేపదే పేర్కొంటున్నారు.

Updated Date - 2021-12-06T00:55:56+05:30 IST