హెడెన్ నాతో 3 ఏళ్లు మాట్లాడలేదు: ఉతప్ప

ABN , First Publish Date - 2021-05-18T01:50:17+05:30 IST

. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉతప్ప ఆ మ్యాచ్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

హెడెన్ నాతో 3 ఏళ్లు మాట్లాడలేదు: ఉతప్ప

`టీ-20 వరల్డ్‌ కప్‌-2007` సందర్భంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భాగంగా చోటుచేసుకున్న స్లెడ్జింగ్‌ కారణంగా మ్యాథ్యూ హెడెన్‌ తనతో చాలాకాలం మాట్లాడలేదని వెటరన్ క్రికెటర్ ఉతప్ప తాజాగా వెల్లడించాడు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉతప్ప ఆ మ్యాచ్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. 


`ఒక వ్యక్తిగా, బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడెన్ అంటే నాకెంతో ఇష్టం. 2007 ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆసీస్ క్రికెటర్ల స్లెడ్జింగ్‌కు మేం కూడా అంతే దీటుగా స్పందించాం. హెడెన్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నన్ను ఉద్దేశించి ఏదో అన్నాడు. నేను కూడా తిరిగి గట్టిగా బదులిచ్చాను. అలా మా మాధ్య వాగ్వాదం జరిగింది. అయితే, అది అక్కడితో ముగిసిపోలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు, మూడేళ్ల పాటు అతడు నాతో మాట్లాడలేదు. నాకు దూరంగా ఉండేవాడు. అది నన్ను చాలా బాధించింద`ని ఉతప్ప చెప్పాడు. 

Updated Date - 2021-05-18T01:50:17+05:30 IST