యూటీఐ ఏఎంసీ షేర్లు... కొత్త గరిష్టం
ABN , First Publish Date - 2021-07-28T20:33:29+05:30 IST
యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్సీ) షేర్లు బుధవారం ట్రేడింగ్లో ఇరగదీసి, రూ. 994 ల కిత్త గరిష్టానికి చేరుకున్నాయి.
ముంబై : యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్సీ) షేర్లు బుధవారం ట్రేడింగ్లో ఇరగదీసి, రూ. 994 ల కిత్త గరిష్టానికి చేరుకున్నాయి. మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటకీ మంచి ఆదాయాలతో బుధవారం నాటి ఇంట్రా-డే ట్రేడ్లో బీఎస్ఈపై 8 శాతం ర్యాలీ చేశాయి. అంతకుముందు అత్యధికంగా ఉన్న రూ. 947.20 లను అధిగమించింది. కిందటి సంవత్సరం అక్టోబరు 12 న స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇది అత్యధిక స్థాయిలో ట్రేడ్ చేసింది.
కిందటి వారంలో బెంచ్మార్క్ ఇండెక్స్ ఫ్లాట్ పెర్ఫార్మెన్స్తో పోలిస్తే, స్టాక్ దాదాపు 15 శాతం పెరిగి మార్కెట్ను అధిగమించింది. ఇటీవలి రన్-అప్ను ఫాలో చేస్తూ కంపెనీ మార్కెట్ ధర 2020 అక్టోబరు 12 న 52 వారాల కనిష్ట రూ. 471 నుంచి 111 శాతం పెరిగింది. ఐపీఓ ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ. 554 నుంచి 79 శాతం స్టాక్తో అప్రిషియేట్ చేయబడింది. మార్చి 2021 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 133.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేయడంతో, ఈ మూడు నెలల్లో యూటీఐ ఏఎంసీ 63 శాతం లాభపడింది.