తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోంది: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-07-08T22:32:33+05:30 IST

తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోంది: ఉత్తమ్

తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోంది: ఉత్తమ్

హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీలోనూ తెలంగాణ రైతాంగానికి ఇంత నష్టం జరగలేదన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుతో నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. నీరు తరలిపోతున్నా పట్టించుకోని కేసీఆర్ సీఎంగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. కేవలం మూడు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయడానికి తెలంగాణ ప్రజానీకాన్ని తాకట్టుపెట్టి.. లక్షా 18వేల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని పేర్కొన్నారు. కృష్ణానది నుంచి హక్కుగా, ఉచితంగా వచ్చే11 టీఎంసీలను.. ఏపీ తీసుకుపోతుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

Updated Date - 2021-07-08T22:32:33+05:30 IST