జిల్లా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో చర్చిస్తా: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-08-08T21:19:36+05:30 IST
జిల్లా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో చర్చిస్తా: ఉత్తమ్
నల్గొండ: మిర్యాలగూడ మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో చర్చిస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సిన్ చేరడంలేదన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సౌకర్యాలు లేక ఆన్లైన్ విద్యపై ఆసక్తి కనబరచడం లేదని చెప్పారు. పిల్లలకు వాక్సినేషన్ చేపట్టి పాఠశాలలు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారని చెప్పారు. ఐకేపీ మహిళా సంఘాల గ్రూపులకు వడ్డీ లేని రుణాలు రెండున్నరేళ్లుగా బ్యాక్లాగ్లో ఉన్నాయన్నారు.