కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యిండా?: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-11-28T01:59:52+05:30 IST

ప్రధాని మోడీ, కేసీఆర్ రైతులను నట్టేట ముంచారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యతన్నారు.

కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యిండా?: ఉత్తమ్

హైదరాబాద్: ప్రధాని మోడీ, కేసీఆర్ రైతులను నట్టేట ముంచారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యతన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు కొనలేని ప్రభుత్వాలు మనకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. రెండూ దగాకోరు ప్రభుత్వాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు నష్టపోవడానికి కేసీఆరే కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తడిసిన ధాన్యంను కూడా కొనుగోలు చేశామని గుర్తుచేశారు. వ్యవసాయ మంత్రి సిల్లీగా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతీ గింజను కొనాలి.. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యిండా అనే అనుమానం ఉందన్నారు.  


Updated Date - 2021-11-28T01:59:52+05:30 IST