కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2021-05-21T00:06:19+05:30 IST

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఉత్తమ్‌

హైదరాబాద్: కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయుష్మాన్‌ సీఎం కేసీఆర్‌ దిక్కుమాలిన స్కీం అన్నారని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కరోనాకు ఉచిత ట్రీట్మెంట్ ఇస్తున్నారని, తెలంగాణలోనూ కరోనాకు ఉచితంగా వైద్యం అందించాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు. నామమాత్రపు ఫీజుతో అంబులెన్స్ సర్వీసులు అందించాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్లు లేవని, వాక్సినేషన్ ఎందుకు ఆగిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అసమర్థతతో ప్రజలు ప్రాణాలు పోతున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2021-05-21T00:06:19+05:30 IST