UP: ఆర్థిక ఇబ్బందులతో గోమతి నదిలో దూకిన వ్యక్తి
ABN , First Publish Date - 2021-07-18T21:59:49+05:30 IST
కరోనా కాటు మామూలుగా లేదు. ఆకలితో పస్తులుండలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఉత్తరప్రదేశ్: కరోనా కాటు మామూలుగా లేదు. ఆకలితో పస్తులుండలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కరోనా ప్రభావం కారణంగా పని దొరక్కా.. రోజువారి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక.. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అదే సమయంలో ఆ దారిలో పోతున్న ఇద్దరు యువకులు చూసి వెంటనే నదిలోకి దూకి ఆ వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అతనిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు.