కల్తీ మద్యం తాగి నలుగురు మృతి... ముగ్గురికి తీవ్ర అనారోగ్యం!
ABN , First Publish Date - 2021-03-22T15:40:05+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలోని రాజాపూర్...
చిత్రకూట్: ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలోని రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోపా గ్రామంలో కల్తీ మద్యం తాగి నలుగురు మృతి చెందారు. మరోముగ్గురు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ ఉదంతంలో పలువులు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్తీ మద్యం తాగిన నలుగురు వ్యక్తులు శని, ఆదివారాలలో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిని వెంటనే ప్రయాగ్రాజ్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.