ఉమెన్స్ హాస్టల్లో షాకింగ్ ఘటన.. 23 ఏళ్ల మెడికల్ విద్యార్థిని గదిలో..
ABN , First Publish Date - 2021-10-19T17:29:55+05:30 IST
ఆ అమ్మాయికి చదువే..
ఇంటర్నెట్డెస్క్: ఆ అమ్మాయికి చదువే ప్రపంచం. హాస్టల్లో ఉంటూ డాక్టర్ చదువు అభ్యసిస్తోంది. భవిషత్తులో డాక్టర్ పట్టా పొంది సేవలందించాలనుకుంది. కానీ అలాంటి అమ్మాయి జీవితంలో షాకింగ్ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ పట్టణం శివ్నగర్కు చెందిన ప్రమోద్ చౌదరి కుమార్తె వైశాలి చౌదరి అనే 23ఏళ్ల అమ్మాయి.. మొరాదాబాద్లోని తీర్థంకర్ మహావీర్ విశ్వవిద్యాలయంలో ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. తనతోపాటే చదువుకున్న స్నేహితురాలు ఊర్వశి వచ్చిందంటే.. తన రూమ్మేట్ను తీసుకుని ఆదివారం బయటకు వెళ్లింది. ఉత్తరాఖండ్కు చెందిన ఊర్వశి కూడా అదే విశ్వవిద్యాలయంలో వైశాలితో కలిసి చదువుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. చదువుకు సంబంధించిన కొన్ని పేపర్లు అవసరం పడడంతో ఊర్వశి శనివారం మొరాదాబాద్కు వచ్చి.. గ్రాండ్ సాయి హోటల్లో దిగింది.
ఆదివారం సాయంత్రం వైశాలి, తన రూమ్మేట్ ఊర్వశి ఉన్న హోటల్కు వెళ్లారు. రాత్రి కావడంతో హాస్టల్కు వెళ్దామని వైశాలి రూమ్మేట్ అడగ్గా.. ‘నువ్వు వెళ్లు.. నేను ఉదయం వస్తాను’అని వైశాలి చెప్పింది. దీంతో ఆమె వెళ్లిపోయింది. సోమవారం ఉదయం 8.30గంటల సమయంలో గ్రాండ్ సాయి హోటల్ నుంచి నేరుగా హాస్టల్కు వెళ్లిన వైశాలి.. 11.30 గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో తోటి విద్యార్థినులందరూ ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం అందించగా వారు హాస్టల్కు వచ్చారు. సూసైడ్కు సంబంధించిన ఏదైనా లెటర్ కనిపిస్తుందేమోనని పోలీసులు, హాస్టల్ మేనేజ్మెంట్ గది మొత్తం వెతికారు. కానీ ఏమి దొరకలేదు. పోలీసులు వైశాలి రూమ్మేట్స్ను ఎంక్వైరీ చేశారు. దీంతో వారు ఆదివారం సాయంత్రం ఆమె బయటకు వెళ్లొచ్చిన విషయం చెప్పారు. గ్రాండ్ సాయి హోటల్లో ఉన్న ఊర్వశిని స్టేషన్కు పిలిపించారు. వైశాలి ఆత్మహత్యకు గల కారణాల కోసం ఆమెను విచారిస్తున్నారు.
కూతురి మరణవార్త తెలిసి వైశాలి తల్లిదండ్రులు మొరాదాబాద్కు వచ్చారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏవేవో కారణాలు చెప్పి ఇంటికే పంపించని హాస్టల్ నిర్వాహకులు.. శనివారం సాయంత్రం తన కూతురును బయటకు ఎలా పంపించారో తెలియడం లేదని కన్నీరుమున్నీరయ్యారు.