వీర్రాజు వెంటే మేమంతా: వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2020-07-17T11:35:31+05:30 IST

వైసీపీ రాజమహేంద్రవరం రూరల్‌ సమన్వయకర్త ఆకుల వీర్రాజు వెంటే తామంతా ఉంటామని రూరల్‌ మండలం వైసీపీ నాయకులు ..

వీర్రాజు  వెంటే మేమంతా: వైసీపీ నాయకులు

రాజమహేంద్రవరం రూరల్‌, జూలై 16: వైసీపీ రాజమహేంద్రవరం రూరల్‌ సమన్వయకర్త ఆకుల వీర్రాజు వెంటే తామంతా ఉంటామని రూరల్‌ మండలం వైసీపీ నాయకులు తీర్మానించారు. తొర్రేడులో రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు యువీవీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పడాల ప్రసాదుతోపాటు పలువురు నాయకులు మాట్లాడుతూ రెండుసార్లు పరాజయం పాలైనా పార్టీ అభివృద్ధికి కష్టపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆకుల వీర్రాజుతోపాటే తమ పయనమన్నారు. సీజన్‌ నాయకులకు ఎటువంటి భవిష్యత్తు ఉండదన్నారు. కార్యక్రమంలో పిన్నమరెడ్డి సూర్యచంద్రరావు, చెరుకూరి సత్యనారాయణ, సుబ్బారావు, కొమ్ము శ్రీనివాస్‌, తాడేపల్లి విజయ్‌కుమార్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-17T11:35:31+05:30 IST