కరోనా.. ఇళ్లు ఖాళీ చెయ్‌..

ABN , First Publish Date - 2021-05-09T09:14:08+05:30 IST

కరోనా బారిన పడిన వృద్ధురాలి సామగ్రిని ఇంటి యజమాని బయ ట పడేశాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట శివారు పద్మావతినగర్‌లో జరిగిందీ అమానుషం. బొజ్జా సామ్రాజ్యం(65) ఉన్న ఇంటిని కొడుక్కి ఇచ్చి, తనకు వచ్చే పెన్షన్‌తో అద్దె

కరోనా.. ఇళ్లు ఖాళీ చెయ్‌..

వృద్ధురాలి సామగ్రి బయటికి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దాష్టీకం


జగ్గయ్యపేట, మే 8: కరోనా బారిన పడిన వృద్ధురాలి సామగ్రిని ఇంటి యజమాని బయ ట పడేశాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట శివారు పద్మావతినగర్‌లో జరిగిందీ అమానుషం. బొజ్జా సామ్రాజ్యం(65) ఉన్న ఇంటిని కొడుక్కి ఇచ్చి, తనకు వచ్చే పెన్షన్‌తో అద్దె ఇంట్లో కాలం వెళ్ల దీస్తోంది. మూడురోజుల క్రితం ఆమెకు కరోనా లక్ష ణాలు కనిపించటంతో జగ్గయ్యపేట ప్రభుత్వాసు పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటి వ్‌ వచ్చింది.  దీంతో ఇల్లు ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి చేశాడు. ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఆమె కొంతగడువు కోరినా వినలేదు. సామగ్రి రోడ్డు మీద పడేశారు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి శ్రీదుర్గ ఫిర్యాదు మేరకు జగ్గయ్యపేట ఎస్సై చినబాబు అక్కడికి వచ్చి ఇంటి యజమానికి కౌన్సెలింగ్‌ ఇచ్చా రు. కొద్ది రోజుల్లో ఆమెను కొవిడ్‌ ఐసొలేషన్‌ సెం టర్‌కు పంపిస్తామని, అప్పటివరకు  ఇంట్లో ఉండని వ్వాలని సూచించారు. 

Updated Date - 2021-05-09T09:14:08+05:30 IST