ప్రజా సంక్షేమానికే వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-06-21T06:31:48+05:30 IST
ప్రజల సంక్షేమం కోసమే ప్రధాని నరేంద్రమోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. సత్యనారాయణ రావు అన్నారు.
ఫబీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు
మల్యాల, జూన్ 20: ప్రజల సంక్షేమం కోసమే ప్రధాని నరేంద్రమోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. సత్యనారాయణ రావు అన్నారు. మల్యాలలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవంను సోమవారం పండగలా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూన్ 25న బ్లాక్డే పాటించాలని, 27న ప్రధాని మోడి మన్కీబాత్ కార్యక్రమం విజవంతం చేయలన్నారు. ఈ సమావేశంలో నాయకులు కరండ్ల మధు, బింగి వేణు, గుడాల రాజేశ్, రాచర్ల రమేశ్, సంగని రవి, రాజు, ముదిగంటి రాజు, పొన్నం మల్లేశం గౌడ్, గాజుల మల్లేశం, జనగాం రాములు, కొక్కెర శ్రీనివాస్, రుత్త కిషన్, రాజన్న, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.