ఇరుజిల్లాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-09-18T06:10:32+05:30 IST

ఇరుజిల్లాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ఇరుజిల్లాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌
వీవీపాలెంలో రాత్రి వేళలోనూ వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

తొలిరోజు ఖమ్మం జిల్లాలో 33,845, భద్రాద్రిలో 22వేల మందికి టీకా

రాత్రి 9 గంటల వరకు కొనసాగిన ప్రక్రియ

ఖమ్మం కలెక్టరేట్‌ /కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: నూరుశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ మూడురోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఖమ్మం డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి మాలతి పర్యవేక్షణలో శుక్రవారం ఉదయం 6గంటలకే ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ రాత్రి 9గంటల వరకు కొనసాగింది. వ్యవసాయ సీజన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వీలుగా ఉండేందుకు రాత్రి వరకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచారు. తొలిరోజున 30 వేల టీకాలు వేయాలని లక్ష్యం పెట్టుకోగా శుక్రవారం రాత్రి 7గంటల సమయానికి 33,845 మందికి టీకాలు వేశారు. శనివారాల్లో కార్యక్రమం కొనసాగనుండగా.. తొలిరోజు ప్రక్రియను కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కొణిజర్లలో సందర్శించారు.  అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 34,200 మందికి లక్ష్యంకాగా జిల్లాలో 342 కేంద్రాల్లో 22వేల మంది వ్యాక్సిన్‌ వేశారు. 



Updated Date - 2021-09-18T06:10:32+05:30 IST