వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారింది: జగన్

ABN , First Publish Date - 2021-03-17T22:53:56+05:30 IST

వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రధానితో మోదీ వీడియోకాన్ఫరెన్స్ తర్వాత అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారింది: జగన్

అమరావతి: వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రధానితో మోదీ వీడియోకాన్ఫరెన్స్ తర్వాత అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన 6 రోజుల ఎన్నికల ప్రక్రియను.. వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయితే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లొచ్చన్నారు. వ్యాక్సినేషన్‌పై సమగ్ర కార్యాచరణతో అధికారులు ముందుకు రావాలని ఆదేశించారు. వైరస్ నివారణ పద్దతులపై అధికారులు దృష్టిపెట్టాలని జగన్ ఆదేశించారు.

Updated Date - 2021-03-17T22:53:56+05:30 IST