వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎంపీపీ
ABN , First Publish Date - 2021-07-30T06:02:38+05:30 IST
వ్యాక్సినేషన్ను వేగవంతంగా చేయా లని ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి కోరారు. మండల పరిధిలోని రెడ్లకుంటలో వ్యాక్సినేషన్ ప్రక్రియను గురువారం పరిశీలించారు. వ్యాక్సిన్
కోదాడ రూరల్, జూలై 29: వ్యాక్సినేషన్ను వేగవంతంగా చేయా లని ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి కోరారు. మండల పరిధిలోని రెడ్లకుంటలో వ్యాక్సినేషన్ ప్రక్రియను గురువారం పరిశీలించారు. వ్యాక్సిన్ విషయంలో ఉన్న అపోహలు వీడి తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కరోనా నుంచి రక్షించుకో వడానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. శానిటైజేషన్ చేసుకుంటూ భౌతికదూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, సర్పంచ్ సాధినేని లీలా అప్పారావు, రైతు సమన్వయ సమితి అద్యక్షుడు మల్లెల బ్రహ్మయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని రామలక్ష్మీపురంలో క్షయవ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సుధీర్ చక్రవర్తి, సూపర్వైజర్ శ్రీనివాసరావు, రాములు, ఏఎన్ఎం జీవమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ రవి తదితరులు పాల్గొన్నారు.