వ్యాక్సినేషన్ విజయవంతం: డా. శ్రీనివాస్
ABN , First Publish Date - 2021-01-17T13:52:58+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో తొలిరోజు (శనివారం) చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిరోజు (శనివారం) చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ సురక్షితమని రుజువు చేశారని తెలిపారు తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో 3,530మందికి టీకా అందించినట్లుగా ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ కోసం రెండు నెలలుగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది శ్రమించారని అన్నారు. కరోనాపై పోరాటంలో సీఎం కేసీఆర్ ముందుండి నడిపించారని డాక్టర్ శ్రీనివాస్ కొనియాడారు.