ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-09-18T05:32:10+05:30 IST

కరోనా నివారణకు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు.

ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
కొవిడ్‌ వ్యాక్సిన్‌ రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ వీపీ గౌతమ్‌.. ముదిగొండలో వ్యాక్సినేషన్‌ పరిశీలన

ముదిగొండ, సెప్టెంబరు 17: కరోనా నివారణకు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన ముదిగొండ మండలంలోని వనంవారిక్రిష్టాపురం, ముదిగొండలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న మెగా కరోనా వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ముదిగొండ ఎస్సీకాలనీ, వనంవారిక్రిష్టాపురం వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. వనంవారిక్రిష్టాపురం లో ఒక బోరు పంపునకు తగిలించిన టైరును పరిశీలించారు. గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టాలని స ర్పంచ్‌లను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌, సర్పంచ్‌ మందరపు లక్ష్మీ, సొసైటీ చైర్మన్‌ తుపాకుల యలగొండస్వామి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో సూర్యనారాయణ, కార్యదర్శి సంపత్‌, వైద్యాధికారి హర్షిదా పాల్గొన్నారు.


Updated Date - 2021-09-18T05:32:10+05:30 IST