భూటాన్‌, మాల్దీవులకు భారత్‌ టీకాలు

ABN , First Publish Date - 2021-01-21T06:18:04+05:30 IST

‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ ప్రాతిపదికన భారత్‌ పంపిన కరోనా వ్యాక్సిన్లు భూటాన్‌, మాల్దీవులకు బుధవారం చేరాయి.

భూటాన్‌, మాల్దీవులకు భారత్‌ టీకాలు

న్యూఢిల్లీ, జనవరి 20: ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ ప్రాతిపదికన భారత్‌ పంపిన కరోనా వ్యాక్సిన్లు భూటాన్‌, మాల్దీవులకు బుధవారం చేరాయి. 1.50 లక్షల కొవిషీల్డ్‌ డోసులను భూటాన్‌కు, లక్ష డోసులను మాల్దీవులకు పంపినట్లు  విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ధ్రువీకరించారు.  బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, సీషెల్స్‌, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌, మారిష్‌సలకు కూడా టీకాలను భారత్‌ ఎగుమతి చేయనుంది. ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో అధిక శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం పట్ల ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మధ్యప్రదేశ్‌ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలకు ఆ టీకాలను అందించేయాలని  ప్రభుత్వానికి సూచించింది. 

Updated Date - 2021-01-21T06:18:04+05:30 IST