వ్యాక్సిన్లకు వీలైనన్ని ఎక్కువ నిధులు కేటాయించాలి
ABN , First Publish Date - 2022-01-23T07:59:19+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధి, కొనుగోలు, పంపిణీకి వీలైనన్ని ఎక్కువ నిధులను బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించాలని కామినేని హాస్పిటల్స్ సీఓఓ గాయత్రీ కామినేని కోరారు.........
కామినేని హాస్పిటల్స్ సీఓఓ గాయత్రీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధి, కొనుగోలు, పంపిణీకి వీలైనన్ని ఎక్కువ నిధులను బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించాలని కామినేని హాస్పిటల్స్ సీఓఓ గాయత్రీ కామినేని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి మహమ్మారులు ఎదురైనప్పుడు ఎదుర్కోవడానికి ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని.. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా దేశీయ హెల్త్కేర్ రంగం ఒత్తిడికి గురవుతుందని తెలిపారు. కొవిడ్తో దేశంలో హెల్త్కేర్ రంగంలో పటిష్ఠమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించిందని.. దీన్ని ముందుకు తీసుకువెళ్లడానికి బడ్జెట్లో చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని రకాల ప్రాణాధార ఔషధాలను అమోదయోగ్యమైన ధరలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.