‘ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి’

ABN , First Publish Date - 2021-05-11T05:27:01+05:30 IST

ఆర్టీసీ ఉద్యోగ కార్మికులందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నేషనల్‌ మజ్దూర్‌ యూని యన్‌ రీజినల్‌ కార్యదర్శి మద్దిలేటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి’

కర్నూలు(రూరల్‌), మే 10: ఆర్టీసీ ఉద్యోగ కార్మికులందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నేషనల్‌ మజ్దూర్‌ యూని యన్‌ రీజినల్‌ కార్యదర్శి మద్దిలేటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా బారినపడిన ఉద్యోగులకు హాస్పెటల్‌లో బెడ్స్‌ కేటాయించి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. వ్యాక్సినేషన్‌ లేనందున 17 శాతం ఉద్యోగులు కరోనా సోకి మృతి చెందారని అన్నారు. ఆర్టీసీలో ఇంకా 50శాతం కూడా మొదటి డోసు వ్యాక్సినేషన్‌ జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ ఉద్యోగ కార్మికలకు వ్యాక్సినేషన్‌ చేపట్టాలని కోరారు.

Updated Date - 2021-05-11T05:27:01+05:30 IST