వ్యాక్సిన్ కొనుగోలులో మీనమేషాలు
ABN , First Publish Date - 2021-05-09T07:31:53+05:30 IST
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోందని, దేశంలో కరోనా వైరస్ అధి కంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీలోని 8 జిల్లాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి(కూర్మాపురం అబ్బు) అన్నారు.
రాయవరం, మే 8: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోందని, దేశంలో కరోనా వైరస్ అధి కంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీలోని 8 జిల్లాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి(కూర్మాపురం అబ్బు) అన్నారు. శనివారం కూర్మాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంపూర్ణ వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నారు. వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ వైసీపీ సర్కారు మీనమేషాలు లెక్కపెడుతూ అలసత్వ ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అలసత్వం విడనాడి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేపట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.