మునిసిపల్ కౌన్సిల్లో వాడీవేడి చర్చ
ABN , First Publish Date - 2021-07-29T05:30:00+05:30 IST
మునిసిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది.
ఇచ్ఛాపురం: మునిసిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. మునిసిపల్ షాపులు బహిరంగ వేలం నుంచి ఓబీఎస్ కింద, పైన షాపులను మినహాయించి మిగతా షాపులకు వేలం వేయాలని కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి ప్రతిపాదనకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.ఫఆర్బీకేలు ఏర్పా టుచేయాలని, డ్వాక్రా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహణకు సామాజిక భవనాలు నిర్మించాలని, బెల్లుపడలో నిర్మిస్తున్న యూహెచ్సీ రత్తకన్న మార్చడానికి చర్యలు తీసుకోవాలని వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య కోరారు. ఫ ఏఎస్పేటకు మంజూరైన యూహెచ్సీ పురుషోత్తపురం మార్చడంపై కౌన్సిలర్ పత్రి తవిటయ్యయాదవ్ నిలదీశారు.ఫ ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని, గాంఽధీపార్క్లో జిమ్ పరికరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని, వైఎస్ఆర్ కల్యాణ మండపం వినియోగంలోకి తీసుకురావాలని కౌన్సిలర్ లీలారాణి కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ ఫణికుమార్ పాల్గొన్నారు.