వైకుంఠధామం, పాఠశాల భవనం ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-11T06:42:47+05:30 IST

వేములవాడ పట్టణంలో నిర్మించిన కస్తూర్బా బాలికల పాఠశాల నూతన భవనం, వైకుంఠధామాన్ని మంత్రులు కే.తారకరామారావు, కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం ప్రారంభించారు. పట్టణంలోని రెండవ బైపాస్‌ రోడ్డులో సుమారు మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన వైకుంఠధామ్నాన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు.

వైకుంఠధామం, పాఠశాల భవనం ప్రారంభం
కస్తూర్బా పాఠశాల భవనం ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌

వేములవాడ, జూన్‌ 10: వేములవాడ పట్టణంలో నిర్మించిన కస్తూర్బా బాలికల పాఠశాల నూతన భవనం, వైకుంఠధామాన్ని మంత్రులు కే.తారకరామారావు, కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం ప్రారంభించారు. పట్టణంలోని రెండవ బైపాస్‌ రోడ్డులో సుమారు మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన వైకుంఠధామ్నాన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌ తదితరులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసివైకుంఠ ధామంలోని శివుడి విగ్రహం వద్ద  ఫొటోలు దిగారు. అనంతరం పట్టణంలోని 4వ వార్డు పరిధిలో 3.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన కస్తూర్బా బాలికల పాఠశాల భవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.   కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ,  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-06-11T06:42:47+05:30 IST