వజ్రోత్సవ కవి సమ్మేళనం
ABN , First Publish Date - 2022-08-22T04:06:35+05:30 IST
భారత స్వాతంత్య్ర వజ్రోత్స వాల ను పురస్కరించుకొని సాహితీ స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో పట్టణం లోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో వజ్రోత్సవ కవి సమ్మేళ నాన్ని నిర్వహించారు.
లక్షెట్టిపేట రూరల్, ఆగస్టు 21: భారత స్వాతంత్య్ర వజ్రోత్స వాల ను పురస్కరించుకొని సాహితీ స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో పట్టణం లోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో వజ్రోత్సవ కవి సమ్మేళ నాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు గోపగాని రవిందర్ మాట్లాడుతూ కవులు దేశ భక్తి, సామాజిక దృక్పదంతో రచనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమ్మేళనంలో ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి, నూటెంకి రవీంద్ర, అబ్దుల్ గఫార్, కొండు జనార్దన్, పురం సుదాన్ష్ పాల్గొన్నారు.