నడకతో ఆరోగ్య పరిరక్షణ
ABN , First Publish Date - 2021-04-19T06:23:48+05:30 IST
నడకతో ఆరోగ్య పరిరక్షణ
వడ్డెపల్లి, ఏప్రిల్ 18: ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడకను అలవాటుగా మార్చుకోవాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 303 గవర్నర్ తడక కుమారస్వామి గౌడ్ అన్నారు. హన్మకొండ రాంనగర్లోని వాకర్స్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 303 సంఘాలన్నీ ఈ నెల 22న నగరంలోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద మాస్కులు, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సైకిళ్లతో వాకింగ్కు రావాలని తీర్మానించినట్లు తెలిపారు. ఆర్సీ దేశిని లక్ష్మీనారాయణ, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జంగా గోపాల్రెడ్డి, కోండ్ర నర్సింహారావు, పుల్లూరి సుధాకర్, సారంగపాణి, శంకర్, వల్లాల జగన్గౌడ్, ఎల్లగౌడ్, వెంకటేశ్వర్రావు, రాజు, మనోహర్బాబు, కొమురయ్య, రాంచందర్రావు పాల్గొన్నారు.