ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకం: వంశీచంద్ రెడ్డి

ABN , First Publish Date - 2020-08-02T21:48:29+05:30 IST

ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకం: వంశీచంద్ రెడ్డి

ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకం: వంశీచంద్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.కేసీఆర్ ది ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వమని,  పీఆర్సీ లేదని, ఐఆర్ లేదని, డీఏ రాలేదని, సీపీఎస్ రద్దు కాలేదు విమర్శించారు. నియమించిన ఉద్యోగాలకన్నా తొలగించిన ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయని, లంచాలిస్తేనే అంతర్రాష్ట్ర బదిలీలు జరుగుతున్నాయని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలు సమావేశమై జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియ 2 నెలల్లో పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకొని పెండింగ్ లో ఉన్న అన్ని అంతర్రాష్ట్ర బదిలీలను చేపట్టి ఉద్యోగస్తులకు మేలు చేయాలన్నారు. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి భయానక పరిస్థితుల్లో భార్య భర్తలు వేరువేరు రాష్ట్రాల్లో పనిచేస్తూ మనోవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ వోసీలు పొందిన వారందరినీ, గడువు పెంపుతో సంబంధం లేకుండా వెంటనే బదిలీ జీఓలు జారీ చేయాలని, వారి సర్వీస్ నష్టపోకుండా న్యాయం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.


Updated Date - 2020-08-02T21:48:29+05:30 IST